Film City: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) వేదికగా సినీ పరిశ్రమ విస్తరణకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ (Sunjay Dutt) ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (Chandrababu) భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదిగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దీని వెనుక అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ‘ఫిలిం సిటీ’ (Film City) నిర్మాణానికి సంబంధించిన లోతైన వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. అయితే, ఒక పరభాషా నటుడు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటే, సొంత గడ్డపై వేల కోట్ల వ్యాపారం చేస్తున్న టాలీవుడ్ (Tollywood) పెద్దలు మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశం.
Sanjay Dutt: పెట్టుబడుల దిశగా అడుగులు
2026 మార్చి 25న అమరావతిలో (Amaravati) జరిగిన ఈ భేటీ వెనుక గత కొన్ని నెలల కసరత్తు కనిపిస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గత నెలలో (ఫిబ్రవరి 26న) ముంబై పర్యటనలో ఉన్నప్పుడు సంజయ్ దత్తో (Sanjay Dutt) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు 2024 జూలైలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీని సినిమా షూటింగ్లకు హబ్గా మార్చడం, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిలిం సిటీ (Film City) ఏర్పాటుపై సంజయ్ దత్ (Sanjay Dutt) ఆసక్తి కనబరిచారు. తనతో పాటు మరికొంతమంది ఇన్వెస్టర్లను కూడా ఆయన ప్రభుత్వానికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, అరకు, కోనసీమ వంటి అద్భుతమైన లొకేషన్లు ఉన్నప్పటికీ, గత ఐదేళ్లుగా ఏపీలో అవుట్డోర్ షూటింగ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ద్వయం సినిమా రంగానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకోవడం శుభపరిణామం.
Tollywood ద్వంద్వ వైఖరి
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu Film Industry) హైదరాబాద్కే (Hyderabad) పరిమితమైంది. ఏపీలో షూటింగ్లు జరగాలన్నా, స్టూడియోలు రావాలన్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలని పరిశ్రమ పెద్దలు ఎప్పుడూ కోరుతుంటారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సినీ రంగానికి అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు పదేపదే ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వయంగా సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో, పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి ఆయన చొరవ తీసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ ఆహ్వానం ఉన్నప్పటికీ టాలీవుడ్ (Tollywood) అగ్ర హీరోలు, నిర్మాతలు ముఖ్యమంత్రిని కలవడానికి వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Nandi Awards: ‘నంది’ అవార్డులు మీకెందుకివ్వాలి?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లుగా, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చినా పరిశ్రమ తరపున వెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇటీవల తెలంగాణలో జరిగిన ‘గద్దర్ అవార్డుల’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ, ‘పక్క రాష్ట్రం’లో కూడా సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు. అయితే, ప్రభుత్వం పిలిచినప్పుడు స్పందించకుండా, కేవలం వేదికల మీద కోరడం వల్ల ప్రయోజనం ఉండదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయినప్పుడు కానీ, పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు కానీ టాలీవుడ్ (Tollywood) పెద్దలు మౌనంగా ఉండిపోయారు. పొరుగు రాష్ట్ర నటులైన రజనీకాంత్ (Rajnikanth), కమల్ హాసన్ (Kamal Hassan) వంటి వారు స్పందించినంతగా కూడా మన హీరోలు స్పందించకపోవడం వారి అవకాశవాదానికి నిదర్శనమా అనే ప్రశ్న తలెత్తుతోంది.
మార్పు రావాల్సింది ఎక్కడ?
అమరావతిలో (Amaravati) సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రాజెక్టు గనుక పట్టాలెక్కితే, అది టాలీవుడ్ (Tollywood) పెద్దలకు ఒక గుణపాఠం కావాలి. తమ ఆదాయంలో 60 శాతానికి పైగా వాటా ఇచ్చే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఇక్కడి హీరోలకు లేని చొరవ, ఒక బాలీవుడ్ నటుడికి ఉండటం పరిశ్రమ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఎప్పుడూ సినిమా రంగానికి ప్రాధాన్యతనిస్తూనే వచ్చారు. కానీ, పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా భయం వల్ల ప్రభుత్వంతో సఖ్యతగా ఉండలేకపోతున్నారా?
ఏపీని సినీ హబ్గా మార్చాలనే సంకల్పం నెరవేరాలంటే కేవలం బయటి ఇన్వెస్టర్లు సరిపోరు. స్థానిక పరిశ్రమ కూడా ముందుకు రావాలి. ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం. ఇప్పటికైనా టాలీవుడ్ (Tollywood) పెద్దలు తమ మౌనాన్ని వీడి, అమరావతి అభివృద్ధిలో, ఏపీ సినీ మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సినీ పరిశ్రమ మౌనం ఒక పెద్ద వైఫల్యంగా మిగిలిపోతుంది.
















