NewsDabba

Gen Z: జెన్ జీ పోరాడాల్సింది ఇలాంటి వాటి పైనే కదా?

Gen Z: 104 లక్షల కోట్ల సంపద.. కేవలం 3,040 మంది చేతుల్లోనే!

ఓ వైపు ఆకలి కేకలు.. మరోవైపు అపరిమిత సంపద.. ఇది ప్రజాస్వామ్యమా? ధనస్వామ్యమా?

140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో, కేవలం 3,040 మంది వ్యక్తుల చేతుల్లోనే ఏకంగా రూ.104 లక్షల కోట్ల సంపద కేంద్రీకృతమై ఉందనే వార్త సాధారణ మైండ్ సెట్ ఉన్న ఎవరినైనా నివ్వెరపరుస్తుంది. ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026’ విడుదల చేసిన వివరాలు మన పాలనా వ్యవస్థల్లోని తీవ్ర లోపాలను, ఆర్థిక అసమానతల (Economic Inequality) భయానక రూపాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.

ఈ రూ.104 లక్షల కోట్ల సంపద అనేది భారత దేశ నామినల్ జీడీపీలో ఏకంగా 30 శాతానికి సమానం. అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయంలో మూడో వంతు కేవలం 3,040 మంది జేబుల్లోకే వెళ్తోంది. ఇందులోనూ మరింత ఘోరమైన విషయమేమిటంటే.. ఈ మొత్తం సంపదలో 19 శాతం కేవలం టాప్-10 ధనికుల వద్దే కేంద్రీకృతమై ఉంది!

Kerala Politics
Kerala Politics : కేరళ నేర్పుతున్న పొలిటికల్ పాఠాలేంటి?

నివేదిక ప్రకారం ముకేష్ అంబానీ వారసులైన అనంత్, ఇషా, ఆకాష్ అంబానీలు ఒక్కొక్కరూ రూ. 2.75 లక్షల కోట్లకు పైగా ఆస్తులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే టాప్-100 కుటుంబాల చేతిలోనే రూ. 76.5 లక్షల కోట్ల సంపద ఉంటే, అందులో 49 శాతం వాటా కేవలం టాప్-10 కుటుంబాలదే (రూ. 9.08 లక్షల కోట్ల ఆస్తులతో గౌతమ్ అదానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది).

కష్టపడేవాడికి కడుపు కోత.. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్!

“ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రతిభను బట్టి, కష్టాన్ని బట్టి వాళ్లు ఎంతైనా సంపాదించుకోవచ్చు కదా?” అని సమాధానం చెప్పే మేధావులకు అసలు వాస్తవాలు కనబడటం లేదు. ఇక్కడ సమస్య సంపాదించడం కాదు… ధనవంతులు మరింత ధనవంతులుగా మారడానికి, పేదలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోవడానికి దారితీస్తున్న ప్రభుత్వ విధానాలు!

నేడు మన పాలకులు బడా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. వాళ్లకు వేల కోట్ల పన్ను మినహాయింపులు ఇస్తున్నారు, బ్యాంక్ రుణాలను రద్దు చేస్తున్నారు, దేశ వనరులను చౌకగా కట్టబెడుతున్నారు. కానీ, సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి జీవి మాత్రం నిత్యావసర సరుకులపై పెంచిన జీఎస్టీలతో, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారు.

ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ప్రజల సంక్షేమం కంటే సంపన్నుల ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి. ప్రజల నోళ్లు మూయించడానికి ‘ఉచిత పథకాల’ పేరుతో పదో పరకో విదిలిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏదీ లేని చోట ఆ ఉచిత పథకాలే గొప్పగా అనిపించి పేదలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కానీ, అది శాశ్వత పరిస్కారం కాదు… అదొక ‘ఆర్థిక మత్తు పదార్థం’! ప్రజలను ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించకుండా, పాలకులపై ఆధారపడేలా చేసే కుట్ర.

ఆర్థిక అసమానతలు: ప్రపంచ దేశాలు నేర్పిన చేదు పాఠాలు

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే… తీవ్రమైన ఆర్థిక అసమానతలను (Economic Inequality), ప్రజావ్యతిరేక విధానాలను నిర్లక్ష్యం చేసిన ఏ దేశమూ ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు.

Cancer Warrior Adrija Gan
Adrija Gan: చావుతో చదరంగం ఆడి గెలిచింది!

1. శ్రీలంక సంక్షోభం (2022): పాలకులు తీసుకున్న అసంబద్ద ఆర్థిక విధానాలు, కుంబకోణాలు, పన్నుల కోతలు దేశాన్ని దివాళా తీయించాయి. ఉపాధి లేక, తిండి దొరక్క ఆక్రోశంతో రగిలిపోయిన ప్రజలు ఏకంగా అధ్యక్ష భవనాన్ని ముట్టడించి పాలకులను దేశం విడిచి పారిపోయేలా చేశారు.
2. అరబ్ స్ప్రింగ్ (2010-2012): ట్యునీషియాలో ఒక నిరుద్యోగి అయిన వీధి వ్యాపారి తన ఆవేదనతో చేసుకున్న ఆత్మదహనం మొత్తం అరబ్ ప్రపంచాన్నే తలకిందులు చేసింది. తీవ్ర అసమానతలు, అవినీతి, నిరుద్యోగంతో రగిలిపోతున్న ప్రజలు ఈజిప్ట్, లిబియా, యెమెన్ దేశాల్లో ప్రభుత్వాన్ని కూల్చివేశారు.
3. ఫ్రెంచ్ విప్లవం: “కూలి దొరకకపోతే కేకులు తినండి” అన్న పాలకుల నిర్లక్ష్య వైఖరిపై సామాన్యులు తిరగబడి రాచరికాన్ని శాశ్వతంగా పాతిపెట్టారు.

మన దేశంలో కూడా ఈ అసమానతలు ఇలాగే కొనసాగితే, యువతలో ఆక్రోశం పెరిగిపోతే అది భవిష్యత్తులో దేశాన్ని కరవు అగాథంలోకి, తీవ్రమైన అంతర్యుద్ధానికి (Civil Unrest) దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Gen Z ముందుకు రావాల్సిన సమయం ఆసన్నం!

ఇటీవల నీట్ (NEET) పేపర్ లీకేజీల వ్యవహారంలో, భవిష్యత్తును అంధకారం చేసే విద్యా వ్యవస్థ వైఫల్యాలపై ‘జెన్ జీ’ (Gen Z) సోషల్ మీడియా వేదికగా, రోడ్లపైకి వచ్చి ఎలా పోరాడిందో, ఎలా ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసిందో మనమంతా చూశాం.

ఇప్పుడు అంతకంటే పెద్ద పోరాటానికి సమయం ఆసన్నమైంది!

కేవలం పరీక్షల లీకేజీలే కాదు… ఈ దేశ వనరుల లీకేజీపై, ఆర్థిక అసమానతలపై, కార్పొరేట్ అడ్డాగా మారుతున్న రాజకీయాలపై జెన్ జీ గళమెత్తాలి.

UP Thunderstorms
Thunderstorms: ఆకాశం నుంచి ఊడిపడిన మృత్యుమేఘం!

* పన్నుల వ్యవస్థ మారాలి: సంపన్నులపై ఎక్కువ పన్నులు (Wealth Tax / Progress Tax) విధించి, పేద-మధ్యతరగతి వర్గాలకు పన్నుల భారం తగ్గించేలా విధానాలు రూపొందించాలి.
* సమాన అవకాశాలు: ఉచితాల పేరుతో బిచ్చం వేయడం కాకుండా, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను అందించేలా ఒత్తిడి తేవాలి.
* ప్రశ్నించే తత్వం: పాలకుల రెడ్ కార్పెట్ సంస్కృతిని, ధనవంతుల మోచేతి నీళ్లు తాగే వైఖరిని నిలదీయాలి.

ఈ దేశం కొద్దిమంది బిలియనీర్లది మాత్రమే కాదు… చెమటోడ్చి దేశాన్ని నడిపిస్తున్న 140 కోట్ల మంది ప్రజలది. ఈ అసమానతల (Economic Inequality) గోడలను బద్దలు కొట్టకపోతే, భవిష్యత్తు తరాలకు మనం శ్మశానాన్ని మిగిల్చినవారమవుతాం. జెన్ జీ (Gen Z) యువతా… ఆలోచించు! ప్రశ్నించు!
అసమానతలపై పోరాటానికి సిద్ధమవ్వు!

#EconomicInequality #IndiaWealthGap #Wealth360One #BillionairesVsPoor #GenZProtest #IndianEconomy #TaxJustice #AmbaniFamily #AdaniGroup #SystemicCorruption #WealthTax #EconomicJustice #DemocracyVsPlutocracy

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment