NewsDabba

Chandrababu: అదానీకి చంద్రబాబు జీ హుజూర్..!!

Chandrababu: రాజకీయాల్లో ‘యూ-టర్న్’లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నారా చంద్రబాబు నాయుడు, మరోసారి తన అసలు రంగును బయటపెట్టుకున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “అదానీ (Adani) డీల్ అంటేనే అవినీతికి నిలువుటద్దం.. రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాడు” అంటూ గొంతు చించుకున్న పచ్చ దండు, నేడు అధికారం చేతికి రాగానే అదే అదానీ (Adani) కాళ్ల దగ్గర సాగిలపడటం సిగ్గుచేటు. జగన్ హయాంలో కుదిరిన ఒప్పందం వల్ల లక్ష కోట్ల భారం పడుతుందని, ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని పిండేయడమేనని కోర్టు మెట్లెక్కిన పయ్యావుల కేశవ్ వంటి మేధావులు.. నేడు అదే డీల్‌కు ఏ ప్రాతిపదికన పచ్చజెండా ఊపారు? అమెరికాలో ఎఫ్.బి.ఐ (FBI) అదానీ ముఠా లంచాల గుట్టును రట్టు చేస్తుంటే, ఇక్కడ చంద్రబాబు (Chandrababu) మాత్రం ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ వేయడం వెనుక కుమ్మక్కు రాజకీయాలు లేవంటారా? ట్రాన్స్ మిషన్ ఛార్జీలపై కనీస స్పష్టత లేకపోయినా, లక్ష కోట్ల ప్రజా ధనం పణంగా పెడుతున్నా.. బాబు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఇది ప్రజా ప్రయోజనమా లేక అదానీ గడపలో బాబు వేసిన రాజకీయ సాష్టాంగ నమస్కారమా? నాడు ఆరోపించిన ‘అవినీతి భాగస్వామి’తోనే ఇప్పుడు జతకట్టడం అంటే, తన స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను అదానీకి తాకట్టు పెట్టడమే!

మాట తప్పిన బాబు.. మడమ తిప్పిన టీడీపీ!

రాజకీయాల్లో నైతికత అనేది ఒక ఆభరణం కావాలి, కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక ‘అవకాశవాదం’గా మారిపోయింది. వైసీపీ (YCP) హయాంలో సెకీ (SECI) ద్వారా అదానీ (Adani) గ్రీన్ ఎనర్జీ నుంచి విద్యుత్ (Power) కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), టీడీపీ నేతలు ఆకాశమే హద్దుగా విమర్శలు చేశారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే 25 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడుతుందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వంటి నేతలు కోర్టు మెట్లెక్కారు. కానీ, అధికారం అందిన కొద్ది నెలలకే అదే అదానీ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలుకు రంగం సిద్ధం చేయడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిలువుటద్దం పడుతోంది.

Kadambari Jethwani
Kadambari Jethwani : బాధితురాలా? నిందితురాలా? సీఐడీ సెన్సేషన్ రిపోర్ట్

అమెరికాలో కేసుల సెగ.. ఇక్కడ మాత్రం సాగిలపడటమా?

అదానీ గ్రూపుపై (Adani Group) ప్రస్తుతం అమెరికాలో ఎఫ్.బి.ఐ (FBI) తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సోలార్ పవర్ అమ్మే క్రమంలో సుమారు 1750 కోట్ల రూపాయల మేర లంచాలు ఇచ్చారని, అందులో ఏపీలోని అప్పటి పెద్దలకు భారీగా వాటాలు అందాయని న్యూయార్క్ కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ వివాదం ఇంకా తేలకముందే, అదానీకి నోటీసులు ఇచ్చే ప్రక్రియ సాగుతుండగానే, చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం ఈ డీల్‌తో ముందుకు వెళ్లడం వెనుక మతలబు ఏంటి? గతంలో జగన్‌ను ‘అవినీతి చక్రవర్తి’ అని పిలిచిన బాబు, ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థతో చేతులు కలపడం ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు?

ఇది కూడా చదవండి: Seven Hills : తిరుమల ఏడుకొండల వివాదం… వైసీపీ, టీడీపీలలో ఎవరు నిజం?

ట్రాన్స్ మిషన్ ఛార్జీల గుట్టు.. ప్రజలపై భారమే లక్ష్యం!

ఈ ఒప్పందంలో ప్రధానమైన వివాదం ‘ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ ఛార్జీల’ (ISTS Charges) పైనే ఉంది. రాజస్థాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి విద్యుత్తును ఏపీకి తీసుకురావాలంటే ట్రాన్స్ మిషన్ ఛార్జీలు తడిసిమోపెడవుతాయని గతంలో టీడీపీ (TDP) గొంతు చించుకుంది. ఈ ఛార్జీల వల్ల యూనిట్ ధర భారీగా పెరుగుతుందని, అది సామాన్యుడి కరెంట్ బిల్లులో ప్రతిబింబిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విచిత్రమేమిటంటే, ఈ ఛార్జీల మినహాయింపుపై సెకీ (SECI) నుంచి ఇప్పటికీ ఎటువంటి రాతపూర్వక హామీ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే లేఖలు రాసినా స్పష్టత రాలేదని సమాచారం. అయినప్పటికీ, ఈ నెల నుంచే 3000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు బాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అంటే, అప్పట్లో మీరు చెప్పిన లక్ష కోట్ల భారం ఇప్పుడు మాయమైపోయిందా? లేక ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేయడానికి మీరు సిద్ధమయ్యారా?

Revanth Reddy
Revanth Reddy: దమ్మున్న నాయకుడి దిమ్మతిరిగే వ్యూహం!

జగన్ బాటలోనే Chandrababu.. వ్యత్యాసం ఎక్కడ?

నాడు జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అదానీతో (Adani) కుమ్మక్కయ్యారని ఆరోపించినప్పుడు బాబు గొంతులో ఉన్న వాడి, వేడి ఇప్పుడు ఎక్కడికి పోయాయి? “జగన్ హయాంలో అదానీ డీల్ అవినీతి.. బాబు హయాంలో అదే డీల్ అభివృద్ధి” అని నమ్మించడానికి టీడీపీ, అనుకూల మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాస్తవాలు దాగవు. అదానీతో జగన్ కాంప్రమైజ్ అయ్యారని విమర్శించిన బాబు, ఇప్పుడు కేంద్రంలోని పెద్దల ఒత్తిడికో లేక తన రాజకీయ అవసరాలకో అదానీకి దాసోహమయ్యారనేది స్పష్టమవుతోంది.

కోర్టులో కేసులు.. అటకెక్కిన నిరసనలు

ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) గతంలో ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు ఇంకా విచారణలో ఉండగానే, అదే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం డీల్‌ను అమలు చేయడం హాస్యాస్పదం. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా ధనం గురించి మాట్లాడే చంద్రబాబు (Chandrababu), అధికారంలోకి రాగానే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశ్వసనీయత కోల్పోతున్న కూటమి ప్రభుత్వం

రాజకీయాల్లో విమర్శలు చేయడం సులభం, కానీ అదే విమర్శలకు కట్టుబడి ఉండటమే నాయకత్వ లక్షణం. చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నోసార్లు యూ-టర్న్ లు తీసుకున్న చరిత్ర ఉంది. అయితే, అదానీ పవర్ డీల్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఆయన నైతికతను ప్రశ్నిస్తోంది.
లక్ష కోట్ల భారం అని స్వయంగా చెప్పిన నోటితోనే, ఎటువంటి క్లారిటీ లేకుండా డీల్‌ను ఓకే చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడమే. అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాల ముందు మోకరిల్లడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు, పైగా ప్రజల జేబులకు చిల్లు పడటం ఖాయం. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే, అదానీ-బాబు బంధంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజమని నమ్మక తప్పదు.

Pawan Kalyan alliance strategy
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పొలిటికల్ మాస్టర్ క్లాస్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment