NewsDabba

Iran Ship: యుద్ధ మేఘాల మాటున ఇరాన్‌కు భారత్ ఆశ్రయం

Iran Ship: ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, హిందూ మహాసముద్రం ఒక ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రంగా మారింది. ఇటీవల శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌక ‘ఐరిస్ దేనా’ (IRIS Dena)ను (Iran Ship) అమెరికా (America) జలాంతర్గామి కూల్చివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, భారత వ్యూహాత్మక ప్రయోజనాలపై, ఇరాన్-భారత్ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అంశం. ఈ సంక్షోభం నేపథ్యంలో భారత్ (India) తన దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, మానవీయ కోణంలో మరో ఇరాన్ యుద్ధనౌక (Iran Ship) ‘ఐరిస్ లావన్’ (IRIS Lavan)కు ఆశ్రయం కల్పించడం గమనార్హం.

 నిశ్శబ్ద సముద్రంలో నిప్పుల సెగ

హిందూ మహాసముద్రం (Indian Ocean) ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించినా, దాని అడుగున వ్యూహాత్మక యుద్ధ తంత్రాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. మార్చి 4వ తేదీన శ్రీలంకలోని (Srilanka) గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో సంభవించిన ఒక పేలుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భారత్ (India) నిర్వహించిన ‘మిలన్-2026’ (Milan 2026) విన్యాసాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన ఇరాన్ (Iran) యుద్ధనౌక ‘ఐరిస్ దేనా’ను (Iris Dea) అమెరికాకు (America) చెందిన ‘షార్లెట్’ అనే అణు ఇంధన జలాంతర్గామి టార్పెడోలతో కొట్టి ముంచేసింది. 80 మందికి పైగా నావికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా (America) జలాంతర్గామి ఒక శత్రు నౌకను నేరుగా కూల్చివేసిన తొలి సందర్భం కావడం గమనార్హం.

Donald Trump
Donald Trump: కబేళా యజమాని అహింసావాదం!

ఐరిస్ దేనా కూల్చివేత: అమెరికా గట్టి హెచ్చరిక

అమెరికా (America) రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఈ దాడిని ధృవీకరిస్తూ, “అంతర్జాతీయ జలాల్లో తాము సురక్షితమని ఇరాన్ నౌక (Iran Ship) భావించింది, కానీ టార్పెడో దెబ్బకు అది సముద్ర గర్భానికి చేరింది” అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఇరాన్ ప్రాబల్యానికి, ముఖ్యంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన దాడులకు అమెరికా ఇచ్చిన అత్యంత కఠినమైన సమాధానం. విశాఖపట్నంలో భారత నౌకాదళం (Indian Navy) నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని, భారత నాయకత్వంతో స్నేహపూర్వకంగా ఫోటోలు దిగిన ఇరాన్ నావికులు కొద్ది రోజులకే జలసమాధి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇది కూడా చదవండి: Donald Trump: కబేళా యజమాని అహింసావాదం!

India సాహసోపేత నిర్ణయం: ‘ఐరిస్ లావన్’కు ఆశ్రయం

దేనా నౌక మునిగిపోవడానికి సరిగ్గా మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 28న ఇరాన్ (Iran) నుండి భారత్‌కు (India) ఒక అత్యవసర అభ్యర్థన అందింది. సాంకేతిక లోపాలతో ఇబ్బంది పడుతున్న తమ మరో యుద్ధనౌక ‘ఐరిస్ లావన్’ (IRIS Lavan)కు కొచ్చి ఓడరేవులో ఆశ్రయం కల్పించాలని ఇరాన్ కోరింది. ఆ సమయంలో అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్ నౌకకు ఆశ్రయం ఇస్తే అమెరికా (Amrica) ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలిసినా, భారత్ వెనకడుగు వేయలేదు. మార్చి 1న అనుమతి ఇచ్చి, మార్చి 4న (దేనా మునిగిపోయిన రోజే) 183 మంది సిబ్బందితో కూడిన లావన్‌ను కొచ్చి తీరానికి చేర్చింది.

Iran War
Iran War: అసలు యుద్ధం ఎందుకు?

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఇది పూర్తిగా ‘మానవీయ కోణం’లో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణంలో ఉన్నా, ఆపదలో ఉన్న నావికులకు రక్షణ కల్పించడం సముద్ర ధర్మమని భారత్ (India) చాటిచెప్పింది. ప్రస్తుతం ఆ 183 మంది ఇరాన్ నావికులకు కొచ్చిలోని భారత నావికాదళ కేంద్రాల్లో వసతి కల్పిస్తున్నారు.

Iran – India సంబంధాలు: ఒక చారిత్రక పరీక్ష

భారత్ – ఇరాన్ మధ్య సంబంధాలు కేవలం చమురు వ్యాపారానికే పరిమితం కాలేదు. ఇవి నాగరికతలతో ముడిపడిన సంబంధాలు. చాబహార్ ఓడరేవు అభివృద్ధి ద్వారా మధ్య ఆసియాకు మార్గం సుగమం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే, ప్రస్తుతం అమెరికా-ఇరాన్ యుద్ధం భారత్‌ను కత్తిమీద సాము లాంటి స్థితిలో నెట్టింది.

  1. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి: ఒకవైపు అమెరికాతో పెరుగుతున్న రక్షణ సంబంధాలు, మరోవైపు పాత మిత్రదేశమైన ఇరాన్ పట్ల బాధ్యత.. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం భారత్‌కు సవాలుగా మారింది.
  2. ప్రాంతీయ భద్రత: భారత పెరటి లాంటి హిందూ మహాసముద్రంలో అమెరికా దాడులు చేయడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. ఇక్కడి శాంతి భద్రతలకు భారత్ ‘నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్’గా ఉండాలని కోరుకుంటుంది. కానీ దేనా ఘటన ఆ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తింది.
  3. ఆర్థిక ప్రభావం: హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత భయాలు, పెరుగుతున్న చమురు ధరలు, రవాణా ఖర్చులు భారత ఆర్థిక వ్యవస్థపై భారాన్ని పెంచుతున్నాయి.

సంయమనం ఎంతో అవసరం

అంతర్జాతీయ చట్టాల ప్రకారం, అంతర్జాతీయ జలాల్లో ఉన్న యుద్ధనౌకలపై దాడులు చేయడం యుద్ధ నేరాల కిందికి వస్తుందని ఇరాన్ (Iran) వాదిస్తోంది. దేనా నౌకలో కేవలం శిక్షణ పొందుతున్న నావికులు (Cadets) మాత్రమే ఉన్నారని, అది యుద్ధంలో పాల్గొనే స్థితిలో లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అరాఘ్చీ ఆరోపించారు. భారత్ (India) మాత్రం ఇక్కడ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తోంది. అమెరికా చర్యను బహిరంగంగా ఖండించకుండానే, ఇరాన్ నావికులకు రక్షణ కల్పించడం ద్వారా తన మిత్రధర్మాన్ని నిలబెట్టుకుంది.

Gulf
GULF: అంతం దిశగా చమురు సామ్రాజ్యం..!?

శాంతి కోసం ఎదురుచూపులు

ఐరిస్ దేనా ఘటన హిందూ మహాసముద్ర చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. యుద్ధం ఎప్పుడూ విధ్వంసాన్నే మిగులుస్తుంది. ఇరాన్ తన నౌక (Iran ship) మునిగిపోయినందుకు ప్రతికారం తీర్చుకుంటామని హెచ్చరిస్తుండగా, అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్ వహించే పాత్ర అత్యంత కీలకం. కొచ్చిలో ఉన్న 183 మంది ఇరాన్ నావికుల క్షేమం భారత్ బాధ్యత. అలాగే, ప్రాంతీయ శాంతిని కాపాడటం కోసం అగ్రరాజ్యాల మధ్య దౌత్య రాయబారం నడపాల్సిన అవసరం భారత్‌పై ఉంది.

యుద్ధం సరిహద్దులను దాటి సముద్రాల మీదకు విస్తరిస్తున్న వేళ, మానవత్వం మరియు దౌత్యం మాత్రమే ప్రాణాలను, ప్రయోజనాలను కాపాడగలవు. భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న ‘మానవీయ దౌత్యం’ ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా నిలవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment